అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ దాదాపు 200 రోజులు ఆపకుండా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
అయితే దీనికి పలు పార్టీల నుండి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సీపీఐ జాతీయ నేత డి.రాజా అతని సంపూర్ణ మద్దతును తెలపగా ఇప్పుడు శైలజానాథ్ కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకమని తెలిపారు.
ఇక ఈ మధ్య వారిపై అన్నీ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చిన వైసిపి వారి నుండి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ “చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైనా రాసిచ్చారా? రాష్ట్రంలో ప్రతి ప్రాంతం వారికి రాజధాని పై హక్కు ఉంటుంది” అని అన్నారు.
రాజధాని ఒక ప్రాంతానికే పరిమితం కాదని గుర్తు చేసిన ఆయన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాజధాని వికేంద్రీకరణ అవసరమనే సూచించిందని. దీనిపై చర్చ అవసరమని అన్నారు. కనీసం రైతులకు కౌలు కూడా ఇవ్వలేని బాబు రాజధాని విషయమై మాట్లాడుతున్నారని అసలు విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు అనడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు.