తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతుండగా తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రెస్ ముందుకు వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని 10 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పిన వారు… నాలుగు ఆసుపత్రుల్లో దాదాపు 2500 బెడ్లు కేవలం కరోనా పేషెంట్లు కోసమే కేటాయించినట్లు తెలిపారు. ఇకపోతే జూన్ మొదటి వారం నాటికి తొమ్మిది వందల కేసులు రిపోర్టు అయ్యాయని హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది.
చాలా మందికి ఈ వైరస్ సోకి ఉండవచ్చు కానీ వారిలో లక్షణాలు మాత్రం కనపడకపోవచ్చు లేదా చాలా తక్కువ కనపడవచ్చు అని తెలిపింది. ఇక ప్రజలు కోలుకునేందుకు ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలను కల్పించామని మరియు వ్యాధి తీవ్రత ఉంటే తప్పించి ఆస్పత్రి అవసరంలేదని అన్నారు.
ఎటువంటి అత్యవసర మరియు అధునాతన చికిత్స అవసరం లేకుండానే వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చు అని చెప్పిన హెల్త్ డిపార్ట్మెంట్. వైరస్ సోకిన తర్వాత తప్పించుకోవడం కంటే… సామాజిక దూరం పాటించి దానిని నివారించడం ఉత్తమం అని హితవు పలికారు