BREAKING: టీమిండియా జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. భారత పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్ వ్యవహరిస్తున్న రవిశాస్త్రికి తాజాగా కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శనివారం సాయంత్రం రవిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడ్డారని తేలింది. దాంతో ఆయనతోపాటు ముగ్గురు సహాయక సిబ్బంది ఐసోలేషన్లోకి వెళ్లారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో కి వెళ్లారు.
BREAKING: రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ..
ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న ముగ్గురు సహాయక సిబ్బంది ప్రస్తుతం హోటల్ కే పరిమితమయ్యారు. వారంతా కూడా కరోనా నెగిటివ్ అని తేలేవరకు టీమిండియా తో కలిసి ప్రయాణాలు చేయడానికి వీల్లేదని తెలుస్తోంది. ఇక మిగిలిన వారు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే నెగిటివ్ అని తేలడంతో వారు 4వ టెస్టులో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
MAA Elections: బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్..షాక్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్