Brutal Murder: సమాజంలో చాలా మంది తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు. అయితే వారిలో కొందరు తాము చేసేది తప్పు కాదు, నేరం అంతకంటే కూడా కాదు అని దబాయిస్తుంటారు. అందుకు ఏవో కారణాలు చెబుతుంటారు. ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తి తన కన్న బిడ్డలు ఇద్దరిని తుపాకితో కాల్చి చంపేశారు. ఆ తరువాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అతను చెప్పిన కారణం విని వారు షాకయ్యారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది.
విషయంలోకి వస్తే..మాథ్యూ టేలర్ కల్మన్ అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమారులు. వీరిలో ఓ బాలుడి వయసు రెండేళ్లు కాగా మరో బాలుడి వయసు పది నెలలు. ఇతను పిల్లలు, భార్యతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. ఈ నెల ఏడవ తేదీన తన ఇద్దరు పిల్లలను తీసుకుని మాథ్యూ టేలర్ కోల్మన్ బయటకు వెళ్లాడు. అనంతరం చేపలను వేటాడే తుపాకీతో ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. అనంతరం చంపిన ప్రదేశం మెక్సికోలో వదలివేసి ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే భర్త వ్యవహరిస్తున్న తీరుపై అనుమానం వచ్చిన అతని భార్య పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే స్పందించి తిరుగు ప్రయాణం అయిన మాథ్యూని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో మాథ్యూ చెప్పిన కారణం విని పోలీసులు అవాక్కు అయ్యారు. ఇంతకూ ఆయన చెప్పింది ఏమిటంటే ..నా పిల్లల్లో పాము డీఎన్ఏ ఉంది. పెరిగి పెద్ద అయ్యాక వాళ్లు ప్రపంచానికి ప్రమాదంగా మారతారు. అందుకే తాను చేస్తుంది తప్పని తెలిసినా అందరి క్షేమం కోసం వాళ్లను చంపాను అని చెప్పుకొచ్చాడు.