KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం విషయంలో టీఆర్ఎస్ పార్టీ భారీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పథకంపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ దీనిపై క్లారిటీ ఇస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన ఆరోపణలు మానుకొని దళిత బంధు పథకం కోసం సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా అధ్యయనం చేసి పరిశీలిస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు.
Read More: KCR: కేసీఆర్ కు మద్దతిచ్చిన కేంద్ర మాజీ మంత్రి.. పార్టీ మారడమే మిగిలింది
టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే…
దళిత బంధు పథకం విఫలమైతే నష్టపోయేది తమ పార్టీయేనని కడియం శ్రీహరి అన్నారు. రాబోయే ఐదారు సంవత్సరాలలో రూ.25 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించి దశలవారీగా ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందే విధంగా ప్రయత్నం చేస్తామని కడియం శ్రీహరి అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దళితుల కోసం ఇంత కన్నా గొప్ప పథకం ఉంటే చెప్పండి, అధ్యయనం చేసి ఇక్కడ కూడా అమలు పరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కడియం శ్రీహరి చెప్పారు. రైతుబంధు ప్రవేశపెట్టినపుడు, 24 గంటల కరెంటు ఇస్తామన్నా.. ఇంటింటికీ నల్ల నీళ్లు ఇస్తామన్నా విమర్శలు వచ్చాయని పేర్కొన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఆ పథకాలన్నీ నిర్విఘ్నంగా అమలు జరుగుతున్నాయన్నారు. అలాగే దళిత బంధు ఇస్తామంటే విమర్శలు వస్తున్నాయన్నారు. ఎన్నో రకాల మేధోమథనం చేసిన తర్వాతే దళిత బంధు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని కడియం చెప్పారు.
Read More:
అధైర్యపడవద్దు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళిత జాతి బాగుపడాలని దళిత జాతి పేదరికాన్ని రూపుమాపడానికి దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ప్రవేశపెట్టారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం శాలపల్లి గ్రామ శివారులో భారీ సభను ఈనెల 16వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ముందుగా కొంత మంది దళితులకు ప్రొసీడింగ్ ను అందిస్తారన్నారు. తర్వాత పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లోని దళితులoదరికీ దలితబంధును ఇవ్వడం జరుగుతుందన్నారు. దలితులెవరు అధైర్య పడవద్దని బాల్క సుమన్ చెప్పారు.