Budget 2022: 2022 – 23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బడ్జెట్ లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈ సారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను మినహాయింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 5 జీ సేవలు, ఈ పాస్ పోర్ట్, క్రిప్టో కరెన్సీ పై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్ధుల కోసం వన్ క్లాస్..వన్ ఛానల్ తదితర అంశాలు ఈ బడ్జెట్ లో కీలక ప్రకటనలుగా నిలిచాయి.
కాగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో పలు వస్తువుల ధరలు పెరిగితే, మరి కొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అంటే..
ధరలు పెరిగేవి ఇవే: గొడుగులు (దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది). విదేశాల నుండి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదాహారణకు ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్
ధరలు తగ్గేవి ఇవే: వస్త్రాలు, నగలు, మొబైల్ ఫోన్లు, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్, మొబైల్ ఛార్జర్లు