Bullet Bike: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనే సామెత ఊరికే రాలేదు.. ఈ రెండు వాక్యాలలో అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులే ఉంటాయి.. కట్నం కారణంగా ఇటీవల పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోయాయి.. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.. పీటలమీద పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు వరుడు బుల్లెట్ బైక్ కావాలని పట్టుబట్టగా.. వధువు ఊహించని షాక్ ఇచ్చింది..!!
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని పర్తాపూర్ చౌదరి గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కూతురు కుల్సుమ్ కు అదే జిల్లాకు చెందిన జీషన్ ఖాన్ తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది అయితే కట్నం గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఖలీల్ ఖలీల్ తనుకు ఉన్నంతలో కట్నకానుకలు సిద్ధం చేశారు అనుకున్న పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. వధువు తల్లిదండ్రులు పెళ్లి తంతు ముగిసింది అనుకునే లాగా పెళ్ళికొడుకు పీటల మీద నుంచి లేచి తనకు బుల్లెట్ బైక్ కావాలని కోరాడు. అయితే ఈ సమయంలో బుల్లెట్ బైక్ కొనడం సాధ్యం కాదు అని చెప్పారు. బైక్ కొనకపోతే అందుకు కావాల్సిన డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయగా, అప్పటికప్పుడు బంధువుల దగ్గర నుంచి రూ 2.30 లక్షలు సమకూర్చాడు.. అంతా సద్దుమణిగి పెళ్లి తంతు ముగిసిపోతుంది అని అనుకుంటున్న సమయంలో వధువు ఊహించని విధంగా వరుడికి షాకిచ్చింది.. బుల్లెట్ బైక్ కోసం పెళ్లి పీటలు మీదనే తన తండ్రి అని ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తితో తనకు పెళ్లి వద్దని తేల్చిచెప్పింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ఒప్పించేందుకు ప్రయత్నించిన తన మనసు మార్చుకోలేదు. దాంతో ఈ పెళ్లి ఆగిపోయింది.