ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి ఇప్పటికే భారత దేశంలో అల్లోపతి (ఇంగ్లీష్ మందు) మెడిసిన్ మార్కెట్లోకి విడుదల అయిన విషయం విదితమే. తాజాగా ఆయుర్వేద మందును కనిపెట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు పతంజలి సంస్థ దేశంలోనే మొదటి సారిగా ఆయర్వేద ఔషధాన్ని విడుదల చేసింది.
కరోనిల్ పేరుతో పతంజలి సంస్థ మందును తీసుకువచ్చింది. ఈ ఔషధాన్ని తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేసిన శాస్త్రవేత్తలకు రాందేవ్ బాబా ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. ఎన్నో క్లినికల్ పరిశీలించిన తరువాతే ఈ మందును తీసుకుని వచ్చామని అయన తెలిపారు. ఈ మందును వాడటంతో 69 శాతం మంది మూడు రోజుల్లో, నూరు శాతం మంది ఏడు రోజుల్లో కరోనా నుండి కోలుకున్నట్లు రాందేవ్ బాబా ప్రకటించారు.
కరోనా నివారణ కిట్ ధర రూ.545లే
కరోనా మందు (కిట్టు)ధర 545 రూపాయలుగా నిర్ణయించింది పతంజలి సంస్థ. వారం రోజుల్లో అన్ని పతంజలి స్టార్స్ లలో కరోనా నివారణ మందులు అందుబాటులోకి వస్తాయని పతంజలి యోగ్ పీఠ్ సీఈఓ ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ కిట్ లో 30రోజులకు సరిపడా మందులు ఉంటాయని అయన తెలిపారు.
ఈ మందును కరోనా రోగులే కాకుండా, కరోనా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా సాధారణ ప్రజానీకం కూడా వాడవచ్చని రామకృష్ణ తెలియచేశారు. త్వరలో ఈ కామర్స్ సైట్ లలో కూడా ఈ కిట్ లను అందుబాటులో ఉంచుతామని అయన చెప్పారు.
ప్రస్తుతం దేశంలో నిత్యం 13వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.కరోనా కేసులు రోజు రోజుకు అధికం అవుతున్న ఈ తరుణంలో ఒక పక్క అల్లోపతి, మరో పక్క ఆయుర్వేద ఔషదాలు మార్కెట్లోకి రావడం శుభపరిణామం.