Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) పై వడ్డీ రేటును తగ్గించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకూ పీఎఫ్ పై 8.5 శాతం వడ్డీ ఇస్తుండగా, ఆ వడ్డీ శాతాన్ని 8.1 శాతానికి తగ్గించేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాస్తవానికి పీఎఫ్ వడ్డీ రేటు పెంపు అయినా, తగ్గింపు అయినా చాలా స్వల్ప మోతాదులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. వడ్డీ రేటును 0.25 శాతం మేర తగ్గించడమో, పెంచడమో చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏకంగా 0.40 శాతం మేర వడ్డీ రేటు తగ్గించడంతో ఉద్యోగులకు భారీగా నష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.