AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లోకి లాగిన్ అయి ఫలితాలు చూసుకోవచ్చు.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు లేకుండానే విద్యార్ధులందరినీ ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 27 నుండి మే 9వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని అనేక మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది గ్రేడ్ల ద్వారా ఫలితాలు విడుదల చేయరు. కేవలం మార్కులను మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం గ్రేడ్ లు వారిగా ఫలితాలను ప్రచారం చేసుకుంటే చర్యలు తీసుకుంటామని ఇంతకు ముందే విద్యాశాఖ హెచ్చరించింది.
ఈ ఏడాది మొత్తం 6,21,799 మంది విద్యార్ధులు పరీక్షలకు హజరైయ్యారు. వీరిలో 3,00,063 మంది బాలురు కాగా, 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.