ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆర్ధిక లోటు ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలను కేంద్రం గుర్తించిన విషయం తెల్సిందే. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు నిధులు విడుదలయ్యాయి.
జులై నెలకు గాను కేంద్రం చేసే సహాయం కింద నిధులు విడుదల చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. జులై నెలకు గాను కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు రూ.491.41 కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే పలు రకాలుగా ఆర్ధికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రానికి కరోనా పంజా కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అయితే కేంద్రం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు విడుదల చేసిన మొత్తంతో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి.