అమరావతి, జనవరి 22: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. అన్ని సెట్లను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి శనివారం మీడియాకు చెప్పారు. యూనివర్శిటీల వారిగా మొత్తం ఏడు సెట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.
ఎపి ఈ సెట్, ఎప్రిల్ 19 (అనంతపురం జెఎన్టియు)
ఎపి ఇ సెట్, ఎప్రిల్ 26 (ఎస్వియు)
ఎపి పిజి సెట్, మే 1 నుండి (ఎయు)
ఎపి ఎడ్ సెట్, మే 6 (ఎస్వియు)
ఎపి లా సెట్, మే 6 (ఎస్కెయు)
ఎపి పిఈ సెట్, మే 5 నుంచి (నాగార్జున)
ఎపి ఎంసెట్, ఎప్రిల్ 20నుండి (కాకినాడ జెఎన్టియు)