వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ కోసం తొలి భారత మహిళ తులసి గబ్బార్డ్ పోటీ పడనున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమొక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్ కోసం ప్రయత్నిస్తానని ఆమె ఒక ఇంటర్య్వూలో చెప్పినట్లు సిఎన్ఎన్ ప్రకటించింది.
37 ఏళ్ళ తులసి డెమోక్రటిక్ పార్టీనుంచి పోటీకి దిగుతున్న రెండవ మహిళ. సెనేటర్ ఎలిజెబెత్ వారెన్ కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతి సెనేటర్ కమలా హారిస్ పోటీ చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి.
హవాయి నుండి నాలుగు సార్లు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. జనవరి మూడవ వారంలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు.
గతంలో ఆమె యుఎస్ సైన్యం తరపున ఇరాక్ యుద్ధంలో పనిచేశారు. చిన్నతనంలోనే హిందూ మతంలోకి మారారు. అమెరికా జనాభాలో హిందువులు ఒక శాతం కంటే తక్కువ.
next post