మజిలీ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఫిదా లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను లవ్ స్టోరీ సినిమా పోస్టర్స్ .. అండ్ టీజర్.. లిరికల్ సాంగ్ ఇంకా పెంచాయి. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమా మొత్తం కంప్లీటయింది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టబోతున్నారు శేఖర్ కమ్ముల అండ్ టీం. కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారట. కొందరేమో డిసెంబర్ 25 న క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుందని భావిస్తున్నారట. కొందరేమో 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుందని భావిస్తున్నారట. మరి మేకర్స్ ఏ డేట్ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.
అంతేకాదు ఇప్పుడు అందరిలో ఉన్న మరో సందేహం ఏంటంటే ఈ సినిమా థియోటర్స్ లో రిలీజ్ చేస్తారా లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని. ఈ విషయంలో కూడా మేకర్స్ నుంచి క్లారిటీ లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా థియోటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అయినా జనాలు వస్తారా లేదా అన్నది పెద్ద సందేహం. కాబట్టే ఇంకా మేకర్స్ ఏ నిర్ణయం తీసుకోలేదని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. కంటెంట్ బావుంటే ఓటీటీలో రిలీజైనా కూడా మంచి సక్సస్ అందుకుంటున్నాయి. రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తెలుగు, తమిళ సినిమా ఆకాశం నీ హద్దురా భారీ హిట్ గా నిలిచింది. కాబట్టి లవ్ స్టోరీ ఎలా రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారన్న మాట మాత్రం వాస్తవం.