ఇప్పటిదాకా తమ పార్టీ నాయకులు, వారు తన నుండి వారు అలవర్చుకున్న దూకుడే అతని బలం అనుకుంటున్న జగన్ కు ఆ బలమే బలహీనత గా మారడానికి పెద్దగా సమయం పట్టదని నిదానంగా తెలిసొస్తోంది. వారం రోజుల క్రితమే వైసీపీ నేత ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దీంతో ఆయన అమలాపురం వచ్చి మీడియా సమావేశం పెట్టారు. కోనసీమ లో ఒక మండలం వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్ర చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.
నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ అయిన రవీంద్రబాబు మాట్లాడుతూ…. తమ ముఖ్యమంత్రి జగన్ ను జడ్జీలు కానీ…. చంద్రబాబు కానీ…. కేసులు కానీ ఏమీ వెంట్రుక కూడా కదపలేరని అన్నారు. ఇక వెంట్రుక కూడా పీకలేరు అని చెబుతూ తన చేతి మీద వున్న వెంట్రుకలలో ఒక దానిని పీకి హావభావాలు చూపించారు. ఈ దెబ్బకు అక్కడున్న యువజనం రెచ్చిపోయినా…. చాలామంది మాత్రం ఒక్క ఆ ఒక్క దెబ్బకు షాకయ్యారు. ఇక చుట్టుపక్కల నుండి వచ్చిన వారు కూడా ఆయన అన్న మాటలకు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
న్యాయంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్నారు. ప్రస్తుతం కండిషనల్ బెయిల్ పై ఉన్న ఆయనను కేసులు, జడ్జీలు ఏమీ చేయలేరు అని చెప్పటం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్ళి సంతకం పెట్టకుండా ఉండేందుకు తరచూ పర్మిషన్ తీసుకుంటున్న జగన్ కి అవి అసలు ప్రభావితం చేయవు అనడం హాస్యాస్పదంగా ఉంది.
ఇక ఇప్పటికే జడ్జీలను ఇష్టం వచ్చినట్లు తిడుతున్న వైసీపీ నాయకులు మరియు పేటీఎం బ్యాచ్ అని పిలవబడే కొంతమందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇటువంటి వ్యాఖ్యలు ఏకంగా పదవుల్లో ఉన్న నేతల నుండి వస్తే వారు భవిష్యత్తులో తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రభావం జగన్ పై కూడా భారీగా పడుతుంది. ఇవి ఏమీ తెలియని రవీంద్రను ఎమ్మెల్సీగా ఎందుకు చేశారు అని ఇప్పుడు వైసిపి అంతర్గత విభాగాలు తలలు కొట్టుకుంటున్నాయి.