ఎప్పటి నుండో గ్రహాంతరవాసుల గురించి రకరకాల వార్తలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. గ్రహాంతరవాసులు ఉన్నారు వాళ్ళు మనకంటే చాలా తెలివిగా ఉంటారు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే వారి దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది అని చాలా మంది సైంటిస్టులు అప్పట్లో చెప్పినట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా గ్రహాంతర వాసులను అమెరికా వాళ్ళు పట్టుకున్నట్లు వాళ్లతో మాట్లాడినట్లు కూడా కథనాలు వచ్చాయి. వాళ్లు ఎక్కడ ఉంటారు అన్నిటి గమనిస్తుంటారు భూగోళానికి వచ్చి పోతున్నారని చెప్పుకొస్తారు. ఇదిలా ఉంటే సైంటిఫికల్ గా విశ్వసనీయంగా మాట్లాడే ఇజ్రాయేల్.. ఏ విషయం గురించి అయినా సూటిగా స్పష్టంగా ఉండే దేశానికి గుడ చర్యకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆయన వయస్సు 85 సంవత్సరాలు కావటంతో.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చి ఉంటే నన్ను పిచ్చోడు అని చెప్పి జైల్లో పడేసి ఉండే వాళ్ళు కానీ వాస్తవం ప్రజలకు తెలియాలి అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. గ్రహాంతరవాసులు ఉన్నారు. వాళ్లకి అమెరికా దేశానికి మధ్య ఒక ఒప్పందం కూడా ఉందని చెప్పుకొచ్చారు. మార్స్ గ్రహం మీద పైకి కనిపించ నటువంటి బిల్లం ఉంది..అక్కడ గ్రహాంతర వాసులు ఉంటారని ఈ పరిశోధకులు చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఈ విషయం తెలుసు అని తెలిపారు. వాళ్లు ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గురించి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఇజ్రాయెల్ అమెరికా ఉన్నతాధికారులకు తెలియజేస్తారని ఈ శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్త చేసిన వ్యాఖ్యల పట్ల ఇతర దేశాల పరిశోధకులు చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన ఇప్పుడు చెప్పనా ఆయన చెప్పిన వ్యాఖ్యలు బట్టి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిందే అని అంటున్నారు.