AP Politics : ఆంధ్రప్రదేశ్ టిడిపి పరిస్థితి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడింది. నిన్న మొన్నటి వరకు జాతీయ పార్టీగా దేశమంతటా అన్ని పార్టీలను కలుపుకోవడానికి మోడీకి వ్యతిరేకంగా… అందరినీ కలపడానికి జాతీయ నేతగా చంద్రబాబు ప్రయత్నించిన ప్రయత్నాలు ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం రాష్ట్రంలో వైసీపీ టార్గెట్ గానే ఆంధ్రప్రదేశ్లో టిడిపి రాజకీయాలు చేస్తుంది తప్ప… కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని కనీసం ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి చంద్రబాబుది. ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్ర బడ్జెట్ మీద తన స్పందనను తెలియజేయడం అనేది చాలా సాధారణ విషయం. అయితే సోమవారం కేంద్ర బడ్జెట్ విడుదల అయినప్పటికీ టిడిపి నాయకులు గానీ చంద్రబాబు గారిని ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. బడ్జెట్ బాగుందా లేదా అనే ఈ విషయాన్ని సైతం వారు బయట పెట్టడానికి మోడీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడదామంటే ఏం జరుగుతుందోనన్న భయాన్ని ఇటు చంద్రబాబు టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
AP Politics :ఓట్ కీ నోట్ భయం!
నిన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టులో కీలకంగా మరి… ఏ నిమిషంలోనైనా ఓటుకు నోటు కేసు చంద్రబాబు మెడకు చుట్టుకుంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద.. కేంద్ర ప్రభుత్వ చర్యల మీద ఏమాత్రం నోరు పెద్దలు చేసిన విమర్శించిన లేనిపోని చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఓటుకు నోటు కేసులో కేంద్రం ఒక ఆ విధంగా చంద్రబాబు మేడమీద కత్తిలా వాడుకుంటోంది. చంద్రబాబు తన చర్యలు ముమ్మరం చేసి నప్పుడల్లా ఆ కేసును చూసి భయ పెట్టాలనేది కేంద్రం భావన. ఆ కేసును ఒక ఆయుధంగా వాడాలని కోణంలోనే ఇటీవల వరకూ నానా హంగామా చేసిన అత్యున్నత న్యాయస్థానంలో కేసు చల్లబడింది. లేదా కావాలని చల్లభరిచారు అన్నది బహిరంగ రహస్యం.
Andhrapradesh : అన్నీ పార్టీలది అదే పరిస్థితి!
కేంద్ర బడ్జెట్ మీద రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలది ఒకటే మాట. ఆంధ్రప్రదేశ్ కు ఏ విషయంలోనూ కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా రూపొందిన బడ్జెట్ను రాజకీయ పార్టీలేవీ కనీసం విమర్శించుకోవడం విశేషం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రమే మీడియా ముందుకు వచ్చి కేంద్ర బడ్జెట్ అంతగా బాగాలేదని చిన్న మాట చెప్పి వెళ్లిపోయారు తప్పితే మిగిలిన పార్టీలేవీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పంపకం విషయంలో రాష్ట్రానికి పట్టించుకోకపోవడాన్ని సరిగా ప్రజలకు చెప్పలేని దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ సైతం బీజేపీ పొత్తు వల్ల.. కేంద్ర బడ్జెట్ అన్ని రకాలుగా బాగుందని ముఖ్యంగా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేసారు తప్ప… రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో గాని.. ఇతర అంశాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే విషయంలో గానీ ఆ పార్టీ సైతం మౌనం వహించింది. కేంద్రానికి… బీజేపీ నాయకులకు ముఖ్యంగా మోడీ అమిత్ షాలకు రాష్ట్ర నాయకులు గౌరవం ఇస్తున్నారో లేదో తెలియదు గానీ పూర్తిగా భయపడుతున్నారు అన్నది మాత్రం వాస్తవం.