Breaking : నాలుగేళ్ల క్రితం నాటి డ్రగ్స్ కేసు టాలీవుడ్ సినీ సెలబ్రెటీలను ఇప్పటికీ వెంటాడుతోంది. తాజాగా డ్రగ్స్ రవాణా, వినియోగంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 టాలీవుడ్ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్ ని డ్రగ్స్ దర్యాప్తులో హాజరుకావాల్సిందిగా ఈడీ ఆగస్టు 31న ఆదేశించింది. అలాగే సెప్టెంబర్ 2 నుంచి 22 లోపు విచారణకు రావాల్సిందిగా టాలీవుడ్ యాక్టర్స్ రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, ఛార్మీ కౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్, రానా లకు సమన్లు జారీ చేసింది.
Breaking : ఆడపిల్లల కోసం యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్.. అప్లై చేసుకోండిలా.. !
సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవితేజ విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ ను నవంబర్ 15 న హాజరు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోరారు.
YS Jagan: మధ్యతరగతి ప్రజల కోసం జగన్ ప్రభుత్వం సరికొత్త ప్లాన్..!!