రాప్తాడు, ఫిబ్రవరి 3: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీతకు డ్వాక్రా మహిళల నుండి నిరసన ఎదురయ్యింది. పలువురు మహిళలు తమ డ్వాక్రా గ్రూపులకు రుణ మాఫీ జరగలేదంటూ నల్లజెండాలతో నిరసనకు దిగారు.
రాప్తాడు నుండి తోపుదుర్తిలో జరిగే కార్యక్రమానికి మంత్రి సునీత వెళుతుండగా యేలేరు గ్రామ శివారులో మహిళలు మంత్రి కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాన్వాయ్పై పలువురు చెప్పులు విసిరారు.
పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను పక్కకు పంపారు. ఈ ఆందోళన కారణంగా తోపుదుర్తిలో సభకు మంత్రి సునీత ఆలస్యంగా హజరయ్యారు.