BREAKING : భారత ప్రభుత్వం గురువారం రోజు ఈ-శ్రామ్ పోర్టల్ను ఆవిష్కరించనుంది. కేంద్రం ఈ-శ్రామ్ పోర్టల్ సాయంతో భారతదేశం వ్యాప్తంగా అసంఘటిత రంగంలో కొనసాగుతున్న నిర్మాణ, ఇతర కార్మికుల ఇన్ఫర్మేషన్ ను డేటా బేస్లో నిల్వ చేయనుంది. కార్మికుల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ‘14434’ జాతీయ టోల్ ఫ్రీ నంబర్ను కూడా లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతానికైతే ఈ-శ్రామ్ పోర్టల్ లోగోను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లాంచ్ చేశారు.
ఈనెల 24వ తేదీన పోర్టల్ లోగోను ఆవిష్కరించిన ఆయన భారత దేశాన్ని నిర్మించే కార్మికులే అసంఘటిత రంగానికి చెందినవారని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమం కోసం ఈ-శ్రామ్ పోర్టల్ ఆవిష్కరించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రామికులు తమ ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా ద్వారా ఈశ్రామ్ పోర్టల్లో చేరవచ్చు. పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి తదితర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.