BREAKING: గడిచిన కొన్ని ఏళ్లలో చాలామంది సుప్రీంకోర్టు జడ్జిలు పదవీ విరమణ పొందారు. దాంతో 34 మంది లాయర్లతో పని చేయాల్సిన సుప్రీంకోర్టు ప్రస్తుతం కేవలం 24 మంది తోనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొలీజియం దేశంలోని వివిధ హైకోర్టులో పనిచేస్తున్న తొమ్మిది మంది హైకోర్టు చీఫ్ జస్టిసులను సుప్రీం కోర్టు లాయర్లుగా నియమించాలని ప్రతిపాదించింది. అయితే తాజాగా కొలిజీయం పంపిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాల లిస్టులో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్థానం దక్కించుకున్నారు. దాంతో ఆమె సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆమె త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
BREAKING : నేడే ఈ-శ్రామ్ పోర్టల్ లాంచ్..!
అయితే ఆమె సుప్రీం కోర్టులో న్యాయమూర్తి కావడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైకోర్టు చీఫ్ జస్టీస్ పదవి ఖాళీ కాబోతోంది. త్వరలోనే తెలంగాణ సీజేగా మరొక న్యాయమూర్తిని నియమించే అవకాశం ఉంది.