Temple: మూర్తికి ఎదురుగా
మనలో చాలామంది గుడికి వెళ్లగానే రెండు చేతులు జోడించి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధలు భగవంతుడికి చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరు దేవుడిని (God) ప్రార్థించుకోవడానికి మూర్తికి ఎదురుగా నిలబడతారు.. కానీ ఇలా చేయడం మంచిది కాదంటున్నారు పండితులు. విగ్రహానికిఎదురుగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి భగవంతుడిని ప్రార్థించుకోవడం వలన భగవంతుడి అనుగ్రహం పొందుతాము అని తెలియచేస్తున్నారు .
Temple: ప్రాణ ప్రతిష్ఠ చేసేసమయం లో
దేవాలయాల (Temple) నిర్మాణం తర్వాత స్వామికి ప్రాణ ప్రతిష్ఠ చేసేసమయం లో అనేక శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆవాహనం చేయడం వలన ప్రతిమ చాలా శక్తివంతం గా మారుతుంది.ఎదురుగా నిలబడం వలన మనం ఆ శక్తిని భరించలేము. స్వామివారికి .. అయన ఎదురుగా ఉండే వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు.మూర్తుల నుండి వెలువడే దైవకృపా అనేది శక్తి తరంగాల రూపంలో ప్రయాణిస్తూ భక్తుని దగ్గరకు చేరుతుంది. . అలాంటి సమయంలో మానవదేహం విగ్రహానికి ఎదురుగా నిలబడితే ఆ కిరణాలను తట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని,కొన్ని సందర్భాలలో అది హానికరంగా కూడా ఉంటుంది. ఈ కారణం గా మూర్తులకు ఎదురుగా కాకుండా కాస్త పక్కకు ఉండి ప్రదించాలి.
శారీరకబలం తో పాటు
మనం సరిగా పరిశీలిస్తే చాలా ఆలయాలలో మూర్తులకు ముందు భాగంఖాళీ గా ఉండి దేవుడికి దండం పెట్టుకుని ఒకపక్కనుండి వెళ్తూ మరొక వైపు నుండి బైటికొచ్చేలా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ విధానం లో పక్కగానే ఉండి నమస్కరించుకున్న కూడా విగ్రహం ముందుకు వెళ్లగానే మళ్లీ అక్కడా నిలబడి నమస్కరిస్తూఉంటాము. ఇక మీదట అలా చేయకండి. మనం చేతులను జోడించి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. ఇలా జోడించిన్నప్పుడు మెదడు ప్రాణశక్తి పొంది దాంతో శారీరకబలం తో పాటు బుద్ధిబలం, ఆత్మవిశ్వాసం పెరిగి అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తాము.