టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరు సినిమా వస్తుందంటే మెగా అభిమానుల్లో కలిగే ఆనందం, ఉత్సాహం మాటల్లో చెప్పలేము. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వరసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు. కరోనా కారణంగా అనుకున్న ప్లాన్స్ లో కొన్ని అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. లేదంటే ఈ పాటికి మెగాస్టార్ నుంచి మరో రెండు సినిమాలు వచ్చేవే. ఇక సైరా నరసింహా రెడ్డి కూడా విడుదలై సంవత్సరం దాటింది. చిరు నుండి ఆచార్య వస్తుందనుకున్న సమయంలో కరోనా వచ్చి దెబ్బ కొట్టింది.
దీంతో చిరు అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాని 2021 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా చేతిలో ఉండగానే చిరు మరో రెండు సినిమాలను ఓకే చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకటి కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అయితే మరొకటి మాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ రీమేక్. అయితే “లూసిఫర్” రీమేక్ విషయంలో ఎప్పటి కప్పుడు షాకింగ్ న్యూస్ వచ్చి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా చిరు అభిమానులు ఊహించని ట్విస్ట్ కంగారు పెడుతుందని సమాచారం.
“లూసిఫర్” తెలుగు రీమేక్ లో హీరోయిన్ ఉండదని తెలుస్తుంది. వాస్తవంగా లూసిఫర్ ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ సరసన హీరోయిన్ ఉండదు. కాబట్టి తెలుగు రీమెక్ లో మెగాస్టార్ కి హీరోయిన్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. ఇదే గనక నిజమైతే మెగాస్టార్ సినిమాలో ఆయనకి జంటగా హీరోయిన్ లేకపోతే ఒప్పుకోమని మెగా ఫ్యాన్స్ కొందరు చెప్పుకుంటున్నారట. అయితే వినాయక్ మెగాస్టార్ సినిమాని ఫ్యాన్స్ కి తగ్గట్టు తెరకెక్కిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్ ఉండే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!