గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మంచి వేడిగా ఉంది. ప్రధాన పార్టీలు అన్నీ గ్రేటర్ ఎన్నికలలో గెలవటానికి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అంతే కాకుండా భారీ స్థాయిలో నగర ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఎవరికివారు తమ మేనిఫెస్టోలో ప్రజలకు బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించేందుకు కొన్ని అరాచక శక్తులు దిగాయని ప్రయత్నాలు స్టార్ట్ చేశాయని ఆరోపిస్తున్నారు సీఎం కేసీఆర్. అలాంటి వారి ప్రయత్నాలు ఇక్కడ సాగవు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పోలీసులకు ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘవిద్రోహ శక్తుల ఆటలు సాగనిచ్చేది లేదని తెలిపారు. నిరాశ నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నాయని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి గొడవ రాజేసి.. ఎన్నికలలో లబ్ది పొందడానికి కొన్ని అరాచక శక్తులు రెడీ అవుతున్నాయని కచ్చితమైన సమాచారం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరం లో గొడవలు పెట్టి దానికి మతం రంగు పూయాడానికి చూస్తున్నారని కేసిఆర్ హెచ్చరించారు. ఉద్వేగాలు, ఉద్రేక్తలు రెచ్చగొట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని..అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను సీఎం కేసీఆర్ కోరారు.