విజయనగరం, మార్చి 2: ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి తెలియడం పార్టీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్కు కూతుర్తె నుండే తలనొప్పి ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
అరకు టిడిపి ఎంపి అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ పోటీ చేయనున్నారు.
ఈ నేపధ్యంలో కిషోర్ చంద్రదేవ్ కుమార్తె, న్యాయవాది శృతీదేవి తాను కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ధరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. తాను 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని తెలిపారు.
ఈ రోజు విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో మిడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను అరకు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కిశోర్ చంద్రదేవ్ ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా, ఒక సారి రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.