అమరావతి, జనవరి 17: భారతీయ జనతాపార్టీ అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ అని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన పార్టీనే తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు స్పందన లేదనీ, అందుకే హడావుడిగా జగన్తో కేటీఆర్ సమావేశమయ్యారనీ ఆయన చెప్పారు. ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్ఎస్, వైసిపి ముసుగు తొలగిపోయిందని ఆయన తెలిపారు. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చాలన్న కుట్ర జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందన్నారు. అసహనం కప్పెట్టేందుకే కుట్రలకు తెరదీశారని ఆయన వ్యాఖ్యానించారు.
మన రాష్ట్రానికి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు. షెడ్యూల్ తొమ్మిది, షెడ్యూల్ పది సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారని ఆయన అన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలికాన్ఫరెన్స్లో పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
previous post
next post