(శబరిమల)కేరళ, జనవరి 17: కేరళలో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడిపారు. శబరిమల రూట్లో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపినట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్లో పోస్టు చేసింది. ఈ బస్సు ద్వారా కిలోమీటరుకు 56 రూపాయల వంతున ఆదాయం వచ్చినట్లు తెలిపారు. డీజిల్ వాడకం వల్ల కిలోమీటరుకు 31 రూపాయలు వ్యయం అవుతుండగా, ఈ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
ఒక కిలోమీటరుకు విద్యుత్ వినియోగం 1.5నుండి 1.8 కిలోవాట్ల వరకు ఉంటుంది.
కేరళనుంచి సుదూర ప్రాంతాలకు ఈ బస్సులను నడపనున్నట్లు సిఎంఓ తెలిపింది.
ఈ బస్సలో 35మంది ప్రయాణీకులు ప్రయాణించవ్చు, వీల్ఛైర్ సదుపాయం ఉంది. ఒక సారి బ్యాటరీని ఛార్జి చేసిన తర్వాత 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఈ బస్సులలో జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థలు, సిసిటివి కెమెరాలు కలిగివుంది.
పర్యావరణ కాలుష్య నివారణకు ఈ బస్సులను కేరళ ప్రభుత్వం వాడుకలోని తీసుకువస్తోంది.
previous post
next post