రాజ్యం కోసం బంధు, మిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించి ,దిక్కు తోచని అర్జునుడు నా “కర్తవ్యమేమి?”అని కృష్ణుడిని అడిగాడు . ఆలా అర్జునికి అతని రథ సారథిగా ఉన్న శ్రీకృష్ణుడి కి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత .
భగవద్గీత అర్జునుడికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానబాండాగారం వంటిది . శ్రీ కృష్ణు భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు . శ్రీ కృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు . నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు . పాండవులు ప్రతి కష్టంలోనూ కృష్ణ ప్రమాత్మ వెన్నంటే ఉన్నాడు , వారికీ ఎన్నో విషయాలను సమయాను కూలంగా బోధించాడు . అటువంటి వాటిలో కొన్ని తెలుసుకుని ఆచరిద్దాం . దాహం తో ఉన్నప్రాణి అది ఎవ్వరైనా సరే ,వారికి మంచి నీళ్లు ఇవ్వడం ధర్మం . మంచి నీళ్లు ఇవ్వడానికి కులం ,మతం ,ప్రాంతం చూడకూడదు . నీరు మనుషులకు మాత్రమే కాదు దాహార్తితో వచ్చిన ఏ జీవివిని అయినాసరే నీళ్లిచ్చి ఆదుకోవాలి . నీరు అన్ని ప్రాణులకూ జీవనాధారమైనది . నీరు ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటుంది . అటువంటి నీటిని దానం చేయడం వలన సిరి ,సంపదలు జీవనదిలాగా నిరంతరంగా ప్రవహిస్తాయి . నీటిని వృథా చేయడం మహా పాపం . నీటిని దానం చేయడం మాత్రమే కాకుండా ,సూర్య భగవానునికి తర్పణలను విడవడం ద్వారా ,ఇంటికి వచ్చిన అతిధులను అర్ఘ్య ,పాద్యాలిచ్చి సేవించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది .