రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులతో కూడుకున్న ఒక క్రీడ.అందులోనూ మంత్రి పదవి అందుకోవాలంటే అనేక జిత్తులు కూడా వేయాల్సి ఉంటుంది.
ఈ విషయం ఇప్పటికి నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు అవగతమైంది.వాస్తవానికి జగన్ మొదటి మంత్రివర్గంలోనే రోజాకు అవకాశం దక్కాల్సి ఉండగా కుల సమీకరణాల్లో లెక్కల తేడాల వల్ల అది సాధ్యపడలేదు.దాంతో చిన్నబుచ్చుకున్న రోజాను ఏపిఐఐసి చైర్మన్ పదవినిచ్చి జగన్ బుజ్జగించారు.అయినప్పటికీ ఆమెకు మంత్రి పదవిపై మోజు అలాగే ఉంది.ఇదే సమయంలో ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్చంద్రబోస్ మోపీదేవి వెంకటరమణ లురాజ్యసభకు వెళ్లిపోతుండటంతో ఆ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.ఈ స్థానాల భర్తీ సమయంలోనే మంత్రివర్గంలో పనితీరు సరిగ్గా లేని మరి కొందరికి జగన్ ఉద్వాసన పలికే కసరత్తు జరుగుతోంది.దీంతో సహజంగానే ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు .ఈ విషయంలో రోజా ముందంజలో ఉంది.జగన్ కూడా ఆమెపట్ల సానుకూలంగానే ఉన్నారు.అయితే రోజా కనక మంత్రివర్గంలోకి వస్తే తమ హవాకు గండి పడుతు౦దన్న ఉద్దేశ్యంతో రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రులు ఆమెకు మోకాలడ్డుతున్నట్లు బయటకు పొక్కింది.దీంతో రోజా అప్రమత్తమై ఆ ఇద్దరు మంత్రులపై దృష్టిపెట్టిందని సమాచారం.వారి లోటుపాట్లు ఇతరత్రా వ్యవహారాల మీద రోజా సమాచారం సమీకరిస్తున్నట్లు వినికిడి.వీటన్నింటిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి తనకు లైన్ క్లియర్ చేసుకోవాలన్నది రోజా ఎత్తుగడగా కనిపిస్తోంది.ఈ ఎత్తుగడల్లో ఆ ఇద్దరు మంత్రులు నెగ్గుతారా లేక మంత్రిని కావాలన్న రోజా కల సాకారం అవుతుందా అన్నది వేచి చూడాలి !