Naalo Naatho YSR: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎప్పుడో ఏడాది క్రితం తన భర్త డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ “నాలో నాతో వైఎస్సార్ “అన్న పుస్తకం రాసి విడుదల చేశారు.అది చదివిన చాలామంది అద్భుతమన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆ పుస్తకాన్ని తమ సెల్ఫ్ లలో భద్రపరుచుకున్నారు.అయితే ఇప్పుడు అదే పుస్తకంలోని కొన్ని అంశాలను వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఎత్తిచూపుతూ విజయమ్మ అన్నీ అబద్ధాలు రాశారని బహిరంగంగా వెల్లడించారు.అదో తప్పుల తడక అని ఆయన పేర్కొన్నారు .దీంతో రాజకీయంగా కలకలం రేగింది.
వైఎస్ పాదయాత్రలో జగన్ పాత్రే లేదు!
ముఖ్యంగా గోనె ప్రకాశరావు పాయింట్ అవుట్ చేసిన అంశం వైఎస్సార్ సాగించిన పాదయాత్ర.ఈ విషయంలో వైఎస్ విజయమ్మ అబద్ధాలు రాశారన్నారు గోనె.వైఎస్ పాదయాత్రలో ఆయన తనయుడు జగన్ సంఘీభావంగా ఉన్నారని విజయమ్మ అబద్ధాలు రాశారని ఆయన పేర్కొన్నారు. నాలో.. నాతో వైఎస్సార్ పుస్తకం 172 వ పేజీలో తప్పులు రాశారని గోనె ప్రకాశరావు చెప్పారు.జగన్ ఎక్కడా పాదయాత్రలో పాల్గొన్న లేదని ఆయన స్పష్టం చేశారు.పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి రాంబాబు, లగడపాటి రాజగోపాల్, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి వెంట ఉన్నారని ఆయన వివరించారు.రాజశేఖర్ రెడ్డి వెంట జగన్ పాదయాత్రలో పాల్గొన్నట్టు నిరూపిస్తే తాను తిరుపతిలో ఉరేసుకుంటానని గోనె ప్రకాశరావు సవాల్ విసిరారు.
ఇద్దరు తెలుగు సీఎంలు జైలుకేనట!
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్పై కూడా ఆయనషాకింగ్ కామెంట్స్ చేశారు.బిజెపి తలుచుకుంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకెళతారని ఆయన పేర్కొన్నారు.తిరుపతి ఉప ఎన్నికలో జగన్ బెయిల్ రద్దవుతుందని బిజెపి బహిరంగంగా ప్రచారం చేయడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.బెయిల్ రద్దయితే జగన్ జైలుకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.కెసిఆర్ కేసుల జాబితాను కూడా తెలంగాణ బిజెపి తవ్విందని ,ఆయనకూ జైలుప్రమాదం పొంచి ఉందని గోనె చెప్పారు. తను నిర్భయంగా చెప్పే విషయాలను కొందరు వ్యక్తిగతంగా తీసుకొని తనను బెదిరిస్తున్నారని,తనను కెలికితే అందరి పురాణాలు బయటపెడతానని గోనె ప్రకాశరావు హెచ్చరించారు.