Syed Anwar: క్రికెట్ ప్రపంచంలో చాలా మెమరీస్ గురించి అప్పట్లో కీలకంగా ఆడిన ప్లేయర్స్.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో మాజీ ఆటగాళ్లు అంతా కలిసి పోయి.. టీమ్స్ గా ఏర్పడి మ్యాచ్ లు కూడా ఆడుతున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో పాకిస్తాన్ టీం లో ఓపెనర్ గా మంచి పేరు సంపాదించిన సయ్యద్ అన్వర్.. తాజాగా తన కెరియర్ లో.. అతి క్లిష్టమైన మరియు భయపడిన బౌలింగ్ శైలి లో.. ఇండియా టీం కి చెందిన వ్యక్తి.. తనని బయటపెట్టినట్లు ఇటీవల తెలిపారు. ఆ బౌలర్ యాక్షన్ కి … బాల్స్ కి.. ఎదుర్కోవటం కష్టమైందని అతని గురించి సచిన్ టెండూల్కర్ తో కూడా చర్చించినట్లు సయ్యద్ అన్వర్ చెప్పుకొచ్చాడు.
ఆ బౌలర్ మరెవరో కాదు దేబాషిష్ మొహంతి. ఒడిశా రాష్ట్రానికి చెందిన మొహంతి.. ఇండియా టీం లో అప్పట్లో పేస్ బౌలింగ్ లో.. స్టార్ బౌలర్ గా రాణించాడు. టెస్ట్ మ్యాచ్ల్లో పెద్దగా రాణించక పోయినా కానీ వన్డే మ్యాచుల్లో సత్తా చాటింది. మహంతి తన కెరియర్ లో45 వన్డేలు ఆడి 57 వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 56 పరుగులుచ్చి నాలుగు వికెట్లు. 1997 లో టొరంటోలో జరిగిన సహారా కప్లో పాకిస్థాన్పై వన్డేలో అరంగేట్రం చేశాడు.
Read More: Srilanka Cricket Team: మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అయింది శ్రీలంక క్రికెట్ పరిస్థితి
ఆ సమయంలో పాకిస్తాన్ తో మ్యాచ్ పడిన టైంలో మొహంతి వేసిన బంతులు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టినట్లు సయ్యద్ అన్వర్ అప్పటి విషయం ఇటీవల బయటపెట్టాడు. అదే సమయంలో బౌలింగ్ విషయంలో సచిన్ వద్ద కూడా తాను మొఱ్ఱ పెట్టినట్లు.. అంతగా మొహంతి తనని ఇబ్బంది పెట్టినట్లు.. స్పష్టం చేశాడు. ఇండియా టీమ్ లో అతి తక్కువ మ్యాచ్లు ఆడిన గానీ మొహంతి తనకంటూ సెపరేట్ ఈ గుర్తింపు దక్కించుకున్నాడు.