అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారన్న కారణంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నలుగురు విద్యార్థులను హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలు అనే విద్యార్థులను హాస్టల్ నుండి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.