భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వైరస్ ప్రభావం కారణంగా ఆర్ధికంగా పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు దారుణంగా నష్టపోతున్నాయి. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(PMGKY) పథకం కింద మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన విషయం తెల్సిందే. ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 8 కోట్ల మంది భారతదేశ ప్రజలు ఈ పథకం కింద లబ్ది పొందారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరో మూడు నెలల పాటు అంటే జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలకు కూడా పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.