గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి దొరకను అనే వేగంతో పరుగులు పెడుతూ.. ఆకాశమే హద్డుగా సాగింది. బంగారానికి ఉన్న డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో ధరలు పెరిగాయి. అయితే, తాజాగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెలవెలబోయింది. నేడు కూడా బంగారం ధరలు పడిపోయాయి.
అయితే, పసిడి నేల చూపులు చూసినా.. వెండి వెలుగులు విరజిమ్ముతూ.. తన డిమాండ్ను పెంచుకుంది. దీంతో వెండి ధరలు మాత్రం పైపైకి కదిలాయి. దేశీయ బులియన్ మార్కెట్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు వెండి ధరలు పెరగడం గమనార్హం. దీనికి అంతర్జాతీయంగా సానుకూల మార్కెట్ వాతావరణమే కారణంగా తెలుస్తోంది.
గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ను గమనిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.45,600 దగ్గరకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,760గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.51,990 గా, చెన్నైలో రూ. 50,250 గా ఉంది.
కాగా, పసిడి ధర తగ్గుతుండగా.. వెండి ధరలు మాత్రం పైకి పెరుగుతూనే ఉన్నాయి. గురువారం దాదాపు రూ.300 పెరిగి, రూ.64,800 లకు చేరింది. దీని సంబంధిత పరిశ్రమల కార్యక్రమాల్లో వేగం పెరగడం, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం మీరు గనక బంగారం కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది మంచి టైం గా చెప్పుకోవచ్చు. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ పసిడి, వెండి ధరలు పరుగులు తీశాయి. బంగారం ధర ఔన్ప్ కు 0.15 శాతం పెరిగి 1808 డాలర్లకు, వెండి 0.22 శాతం పెరగి 23.41 డాలర్లకు చేరింది.