కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కోవిడ్-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది . లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. పలు రంగాలు మైనస్ వృద్ధిలోకి జారుకుంటున్నాయి. అలాంటి జాబితాలో రవాణా , ఆతిథ్య రంగాలు కూడా ఉన్నాయి.
రవాణా, ఆతిథ్య రంగాలకు చెందిన ఉద్యోగులు వేతనాలు అందక పోవడంతో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు 2018-21 లో సెలవు కాలపు రాయితీలు (ఎల్ టీ సీ) సౌకర్యాలు వినియోగించుకో లేకపోయారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి మంచి శుభవార్త ను అందించింది. ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కలిగిన నష్టానికి (ఎల్ టీ సీ) పరిహారం చెల్లించి.. నగదు వినియోగాన్ని పెంచడానికి నిర్ణయించుకుంది.
దీనికోసం 2018-21లోని ఎల్ టీ సీ కి బదులు అర్హతలు తగిన నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు అక్టోబర్12న జారీ చేసిన ఉత్తర్వులు OM.No. F.No.12(2)/2020-Ell లోని నిబంధనలను పరిగణలోకి తీసుకోనుంది.
ఎల్ టీ సీ ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. దీంతో ఎల్ టీ సీకి బదులుగా పొందే నగదుకు కూడా పన్ను మినహాయింపు ను కల్పించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల తో పాటు ఇతరులకు కూడా ఈ అవకాశం కల్పించడంతో దాదాపు 36,000 రూపాయల వరకూ పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా రంగాల ఉద్యోగులకు కొంతమేర లబ్ది చేకూరనుంది.