కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కోటి 80 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య ఏడు లక్షల వరకు చేరువ అయ్యింది.
భారత దేశంలో నేటి వరకు 18,03,695 కరోనా పాజిటివ్ లు నమోదు కదా, 38,135 మృతి చెందారు. గుడ్డిలో మెల్ల నయం అన్నటుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తున్నా రికవరీ శాతం కూడా ఎక్కువగా ఉండటం ఊరట నిస్తున్నది. 11,86,203 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం 5,79, 357యాక్టీవ్ కేసులు ఉన్నాయి ఇండియాలో.
గాలి నుండి కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది శాస్త్రవేత్తలు చెబుతుండటం ప్రజలను ఆందోళన కల్గిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా టీకాకై ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది. అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలతో పాటు భారత్ లోనూ వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి.
సురక్షిత వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి గానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ అక్టోబర్ నాటికి వస్తుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఒ ఆదార్ పూనావాలా ఇప్పటికే వెల్లడించారు.
దాదాపు వంద కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. టీకా వచ్చిన వెంటనే ముందుగా ప్రాధ్యాన్యత వర్గాలకు అంటే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది కి అందించాలని, తదుపరి సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇతర దేశాల అన్నింటి కంటే ముందుగా ఈ నెల 10తేదీ లోపుగానే కరోనా వాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రష్యా ప్రకటించింది.