మరికొన్ని వారాల్లో ఏపీలో జరనున్న అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీని ఓడించేందుకు, జగన్ను గద్దె దింపేం దుకు.. సాగుతున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. టీడీపీ-జనసేనలు మిత్రపక్షంగా ఏర్పడి ముందు కు సాగుతున్నాయి. ఇక, దీనికి బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో.. ఇదే జరిగితే.. 2014 సీన్ మరోసారి ఏపీలో తెరమీదికి రానుంది. అంటే.. వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని అంటున్నా రు పరిశీలకులు. ఒకవేళ ఇదే జరిగితే.. వైసీపీ ఊరుకుంటుందా? అనేది ప్రశ్న.
ఇక్కడే సీఎం జగన్ మరో ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనే ఆయన సింపతీ పాలిటిక్స్కు తెరదీ స్తున్నారు. `మన మీద ఇంత మంది కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నారు. మనం ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలకు సవివరంగా వివరించాలి` అని కార్యకర్తలు, నాయకులకు సూచిం చారు. అంటే.. ఆయన ప్రజల్లో సింపతీ పాళ్లను పెంచే వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు. సహజంగానే ఒక వ్యక్తిని పది మంది కలిసి కొడితే.. ప్రజలు ఎందుకు కొట్టారు? అనే విషయాన్ని పక్కన పెట్టిమరీ సింపతీ చూపిస్తారు.
అవతలి వ్యక్తి ఘోరం చేసినా కూడా.. పది మంది కలిసి కొడతారా? అంటూ.. ఇప్పటికి సమాజంలో సింప తీ చూపించే వర్గాలు మెజారిటీగా ఉన్నాయి. ఇదే ఫార్ములాను జగన్ పఅనుసరించేందుకు వ్యూహాత్మకం గా ముందుకు కదులుతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఈ వాదనను కేవలం తన ప్రసంగాలకే పరిమితం చేశారు. కానీ, ఇక నుంచి ఆయన దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్పస్టంగా తెలు స్తోంది. అయితే, ఇది వర్కవుట్ అవుతుందా? కాదా? అనేది చూడాలి.
మరోవైపు.. ఓడిపోయినా.. కూడా తనపాలన బాగోలేదు కాబట్టి ప్రజలు ఓడించారనే ప్రచారానికి కూడా ఇదే సింపతీతో అడ్డుకట్ట వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇంత మంది కలిసి నన్ను ఒంటరిని చేసి.. ఓడించారు..? అని చెప్పుకొనేందుకు కూడా ఆయన ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అంటే.. ఓటమి నాది కాదు.. అంతమంది కలిశారు కాబట్టి గెలుపు కూడా వారికి రాదు.. కేవలం ఇది ఒక రాజకీయ వ్యూమమే అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకునేందుకు ఒక బిగ్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. మారిన రాజకీయ పరిణామాలతో జగన్ వ్యూహం కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది.