NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court : బలవంతపు ఏకగ్రీవాలపై హైకోర్టు సీరియస్! నిష్పాక్షిక ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశాలు!!

AP High Court : ఏపీలో ఎన్నికల అక్రమాలపై స్పందించాలని.. అందుకోసం అన్ని అధికారాలను వినియోగించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

High Court Serious on Forced Consensus! Orders to see impartial elections !!
High Court Serious on Forced Consensus! Orders to see impartial elections !!

బలవంతపు ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.. నిష్పాక్షిక ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అని.. బలవంతపు ఏకగ్రీవాలపై దృష్టిపెట్టాలని ఎస్‌ఈసీకి సూచించింది. పిటిషనర్లు ఆరోపణలు నిజమైతే అవి తీవ్రమైనవిగా అభిప్రాయపడింది.

AP High Court : హైకోర్టు తలుపుతట్టిన మాజీ ఎమ్మెల్యే శంకర్!

చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె, గుంటూరు జిల్లా మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్లు విఫలమయ్యారని పేర్కొంటూ టీడీపీ నేత అనీషారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయన్నారు.. ఒకవేళ నామినేషన్‌ వేసినా తిరస్కరిస్తున్నారని, అందుకు సరైన కారణాలు కూడా చపించడం లేదని కోర్టుకు వివరించారు. చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఈసీ కూడా నోటిఫికేషన్‌తో తన బాధ్యత తీరిపోయినట్లుగా భావిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు పంపుతున్నట్లు ఎస్‌ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయాలని.. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది కలుగజేసుకుని ఈ పిటిషన్లకు విచారణార్హతే లేదన్నారు.

ఎస్ఈసీకి కీలకాదేశాలు!

వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు కీలక వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఈ దశలో న్యాయస్థానం లోతైన అంశాల్లోకి వెళ్లడం లేదని.. ఉత్పన్నమవుతున్న అంశాలపైనే దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. తనకున్న అధికారాలను వినియోగించి ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. ఇదే అంశాలకు సంబంధించి పలు వ్యాజ్యాలు దాఖలవుతున్న నేపథ్యంలో ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. పిటిషనర్ల ఫిర్యాదులు, అందించిన వినతులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచించారు.

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N