Dark Circles: ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం, విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయి ఆన్ లైన్ క్లాసులు, ఇతర ఉద్యోగాల వల్ల సరైన నిద్ర లేకపోవడంతో పలువురికి కంటి కింద మచ్చలు ఏర్పడుతున్నాయి. సరైన నిద్ర లేకపోవడంతో ఇలా మచ్చలు వస్తుంటాయి. చర్మం దెబ్బతిని నల్లగా మారుతుంది. ముఖం అంతా ఒక రంగులో ఉంటే కళ్ల వద్ద నల్లమచ్చల వల్ల ముఖం కళ దెబ్బతింటుంది.
ఇలాంటి సమస్యలకు ఒక చిట్కా ఉంది. ఇది పాటిస్తే మంచి ఫలితం వస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి చేసుకోవాలి. ఫోన్ లు, లాప్ టాప్ లు ఉపయోగించే వారు కనీసం 20 నిమిషాలకు ఒక సారి కంటికి విశ్రాంతి ఇవ్వాలి. ఇక కంటి కింద నలుపు మచ్చలు పోగొట్టుకునేందుకు ఒక జాజికాయ ను తీసుకోవాలి, సాధారణంగా జాజికాయను కేవలం మసలా దినుసలుగా మాత్రమే చూస్తుంటాము, కానీ జాజికాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
జాజికాయను బాగా దంచి మొత్తని పొడి చేయాలి. జాజికాయలో సహజంగా విటమిన్ ఇ మరియు విటమిన్ సి ఉంటాయి. ఇది డార్క్ సర్కిల్ పై బాగా పని చేస్తుంది. తరువాత అలోవెరా జెల్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా చేయడంలో బాగా పని చేస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేయడంలో కలబంద అద్భుతంగా పని చేస్తుందట. తాజా కలబంద లేదా మార్కెట్ లభించే కలబంద జెల్ ఏదైనా వాడవచ్చు.
ఒక స్పూన్ ఆలోవేరా జెల్ వేసి జాజికాయను పలుచని పేస్టులా చేసి దీనిలో ఒక విటమిన్ ఇ కాప్సిల్ కలిపి మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. ఇది రాత్రి పూట రాసుకుంటే ఉదయం వరకు అలా ఉంచి శుభ్రం చేసుకోవచ్చు. పగటి పూట అయితే గంట సేపు అయినా ఉంచుకోవాలి. కనీసం పది రోజులు పాటు రోజు మార్చిరోజు దీన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.