AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు కేసుల్లో ఉత్తర్వులు వెలువడ్డాయి. సంగం డయిరీ, అమరావతి రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతుల అంశాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది.
అమరావతి ప్రాంతంలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జివో 316 పై తదనంతర చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రాజధాని అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే గత ప్రభుత్వం వారికి ప్యాకేజీ ఇస్తూ జివో 41 ని తీసుకువచ్చిందని రైతుల తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపినా హైకోర్టు జివో 316పై తదనంతర చర్యలను నిలిపివేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా సంగం డైయిరీ విషయంలోనూ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను న్యాయస్థానం కొట్టేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ప్రభుత్వం ఆశ్రయించగా అక్కడా ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. సంఘం డెయిరీ ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
2.YSR 12th death anniversary: విజయమ్మ పెట్టిన పరీక్ష..! వైఎస్ సహచరుల అంతర్మధనం..!!
3.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!