Rajamouli: ఐకాన్ స్టార్ బన్నీ తో గతంలో రామ్ చరణ్ తేజ్ ఎవడు సినిమా చేయడం తెలిసిందే. సినిమాలో ఇద్దరు ఒకేసారి కనిపించిన సన్నివేశాలు పెద్దగా లేకపోయినా గానీ.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించటం జరిగింది. ఇదిలావుంటే ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో “RRR” లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా చెర్రీ.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సారి ఇ బన్నీతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఈ ప్రాజెక్టు చేయాలని అప్పటి నుండి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట.
రాజమౌళి దర్శకత్వంలో వీరిద్దరితో సినిమా తెరకెక్కించాలని.. జక్కన్న తో మంతనాలు జరపటం మాత్రమే కాక.. భారీ డీల్ కూడా జక్కన్నకి ఇవ్వటం జరిగిందట. అయితే ప్రస్తుతం రాజమౌళి RRR షూటింగ్ లో బిజీగా ఉండటం తో పాటు తర్వాత మహేష్ సినిమా ప్రాజెక్టుపై దృష్టి పెట్టడంతో.. అల్లు అరవింద్ ఆఫర్ మొన్నటి వరకు లైట్ టాక్. ఇదిలా ఉంటే ఇటీవల మరోసారి రాజమౌళితో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్లు.., జక్కన్న సానుకూలంగా స్పందించినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. స్టోరీ అంతా ఓకే అయితే గనుక ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా చేసే ఆలోచనలో అల్లుఅరవింద్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.