33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ

Share

హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకి బదిలీ అయ్యింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ నెలలో జాహేద్ ముఠా ను అరెస్టు చేశారు. పాకిస్థాన్, నేపాల్ మీదుగా జాహేద్ గ్యాంగ్ హైదరాబాద్ కు పేలుడు పదార్ధాలు తరలించింది. దసరా పర్వదినం సందర్భంగా నిర్వహించే వేడుకల్లో పేలుళ్లు జరపాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని నిందితులు ప్లాన్ చేశారు.

NIA

 

దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కల్గించేలా ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. నిందితులు జాహేద్ తో పాటు షారూఖ్, సమియొద్దీన్ లు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.  ఈ ముఠా పాక్ నుండి మనోహరాబాద్ కు హ్యాండ్ గ్రనేడ్లు తరలించారు. జాహేద్ అనుచరులు మనోహరాబాద్ నుండి హైదరాబాద్ కు గ్రనేడ్లు  తెచ్చారు. 15 సంవత్సరాల క్రితం టాస్క్ ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్ నిందితుడుగా ఉన్నారు.

ఏపి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల


Share

Related posts

Vakeel Saab : వకీల్ సాబ్ సినిమా థియేటర్ లో సందడి చేసిన దిల్ రాజు..!!

sekhar

CM YS Jagan: బీఏసీలో అచ్చెన్నపై సీఎం జగన్ సీరియస్..! ఎందుకంటే..?

somaraju sharma

యానాంలో ఆమరణ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్…ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు

somaraju sharma