హైదరాబాద్ మార్చి 4 : ఏపి పోలీసులపై కేపిహెచ్ బి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐటి నిపుణుడు, ఐటి గ్రిడ్పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఐటి గ్రిడ్ సంస్థపై ఒక పక్క విచారణ జరుగుతుండగానే ఏపీ పోలీసులు తన ఇంటికి వచ్చి.. తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని లోకేష్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని లోకేష్ రెడ్డి ఆరోపించారు.
లోకేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన ఏపి పోలీసులపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.