ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన లవ్ ట్రాక్ లు పులిహోర కాన్సెప్ట్ లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇక ఏమి మేటర్ లేదంటే డాన్స్ షో లు కూడా క్లిక్ అవ్వవు ఏమో అని అంత రేంజ్ లో తెగ కంటెంట్ చేస్తున్నారు ప్రతి షో లో ట్రాక్ పెట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక నిన్నమొన్నటివరకూ డీసెంట్ యాంకర్ గా ఉన్న ప్రదీప్ కూడా ఎవరితో నడపాలో అన్నట్లు లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు అటు వర్షిణి, ఇటు రష్మీ మరోవైపు జడ్జి లతో క్లోజ్ గా ఉంటున్నారు.
వివరాల్లోకి వెళితే ఢీ 13వ సీజన్ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఈసారి వర్షిని- హైపర్ ఆది ట్రాక్ కనిపించలేదు. వర్షిని స్థానంలో టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అంతగా ఫేమస్ అయ్యే లాగా కనిపించడం లేదు. ఇక వర్షిని స్థానంలో ఆది పులిహోర కలిపేందుకు ప్రియమణి ను ఎంచుకున్నాడు. ఈ సీజన్ అంతా ప్రియమణి ను ఇకపై ప్రియ అని పిలుస్తాను అని చెప్పాడు.
దీంతో కాసింత ట్రాక్ నడిపించి టీఆర్పీ పెంచుకోవాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియా నా గుండె లయ అని కవిత్వం చెబుతూ ప్రియమణి ముందు ఆది మోకాళ్ళమీద కూర్చోబెట్టుకున్నాడు. ఇక అలా కూర్చుని తన తొడలమీద ప్రియమణి కూర్చోబెట్టుకున్నాడు. ఇక ప్రియమణి కి పెళ్లి అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇదంతా ప్రొఫెషనల్ అను కూడా తెలిసిందే అయితే ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.