పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ నుండి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేస్తూ పది పేజీల రహస్య నివేదికను ఐబీ పంపినట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం జరిగే రెడ్ పోర్టు ప్రాంతంలో ప్రజల ప్రదేశాన్ని కట్టుదిట్టం చేయాలని ఐబీ సూచించింది. ఇటీవల జపాన్ దేశంలో ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేపై జరిగిన కాల్పులు, ఉదయ్ పూర్, అమరావతి నగరాల్లో జరిగిన దాడుల ఘటనలను ఐబీ ఉదహరించింది.
ఢిల్లీ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఐబీ తెలియజేసింది. జనసమ్మర్త ప్రదేశాలలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది. ప్రధాన ప్రాంతాల్లో కీలక నాయకులపై దాడులు చేయాలని జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా ఉగ్రవాదులను పాక్ ఐఎస్ఐ కోరినట్లు సమాచారం ఉందని ఐబీ తెలిపింది. అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాది నేతృత్వంలో లష్కరే ఖల్సా పేరిట పాక్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిందని, ఆ సంస్థ ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్ లో పెద్ద ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందని ఐబీ వివరించింది.
పారా గ్లైడర్స్, డ్రోన్ల ద్వారా లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నందున బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ కోరింది. ప్రధానంగా ఢిల్లీలో రోహింగ్యాలు, అఫ్ఘానిస్థాన్, సుడాన్ దేశాల వాసులు నివాసం ఉంటున్న ప్రాంతాలపై ఢిల్లీ పోలీసులు నిఘా వేయాలని సూచించింది. టిఫెన్ బాంబులతో కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఐబీ తన రహస్య నివేదికలో హెచ్చరించినట్లు సమాచారం.
మరో వివాదంతో చిక్కుకున్న వైసీపీ ఎంపీ ..వైరల్ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్