ఫిదా బ్యూటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫిదా తర్వాత కుడా నాని తో ఎం.సి.ఏ, అలాగే పడి పడి లేచె మనసు సినిమాలు చేసింది. కాని ఆ సినిమాలు అంతగా సక్సస్ కాలేదు. అయినా సాయి పల్లవి కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సహజమైన నటనతో తెలుగులో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఒకటి శేఖర్ కమ్ముల నాగ చైత్రన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ కాగా మరొక సినిమా రానా, ప్రియమణి నటిస్తున్న విరాట పర్వం. కాగా మరికొన్ని సినిమాల కోసం సాయి పల్లవి సంప్రదిస్తున్నారట. కాని సాయి పల్లవి మాత్రం నచ్చిన సినిమా మాత్రమే కమిటవుతుంది.
ఇక సాయి పల్లవి కి మరో ఊహించని అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్. మరి ఆ సినిమా కి సాయి పల్లవి ఒకే చెబుతుందా లేదా అన్నది ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ ను రీమేక్ చేయబోతున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం తెలుగు వర్షన్ కి స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నాడు మెహర్ రమేష్.
కాగా సాయి పల్లవి కి ఈ సినిమా లో నటించే అవకాశం వస్తే ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం వేదాళం తమిళ వెర్షన్ లో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉండదు. దాంతో తనకు ప్రాముఖ్యత లేని పాత్ర ఇస్తే సాయి పల్లవి ఒప్పుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోను ఉండదు. అందుకే ఈ సినిమా ని వదులుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది. ప్రాముఖ్య లేని పాత్ర అంటే హీరో ఎవరైనా రిజెక్ట్ చేస్తుందన్న మాట వినిపిస్తుంది.