IND vs ENG : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో ఒకడైన విరాట్ కోహ్లీ నిన్న జరిగిన మూడో టి20 లో అద్భుతమైన ఆట తీరుతో మొదటి ఇన్నింగ్స్లో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అయినప్పటికీ భారత అభిమానులలో చాలా మంది కోహ్లీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన మూడో టి-20లో ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ రెచ్చిపోవడంతో భారత్ చిత్తు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
అయితే అవతలి జట్టు బ్యాట్స్మెన్ కంటే కోహ్లీ యాటిట్యూడ్ రెండో ఇన్నింగ్స్ లో సరిగ్గా లేదని పలువురు విమర్శిస్తున్నారు. పదే పదే అసహనం వ్యక్తం చేయడం… కోపంతో నేలను కాలుతో తన్నడం వంటి హావభావాలు తోటి ఆటగాళ్లలో ఉత్తేజాన్ని రేకెత్తించవు అని వారి వాదన. అలాగే చిన్న స్కోర్లు, ఒక మాదిరి స్కోర్లను డిఫెండ్ చేయడంలో సిద్ధహస్తుడైన కెప్టెన్ ధోనీ సేవలను భారత జట్టు కోల్పోతుంది అని వారు అంటున్నారు. కోహ్లీ ధోనీ లాగా శాంతంగా ఉండాలని అప్పుడే మైదానం లో వాతావరణం బాగుంటుందని సలహా ఇస్తున్నారు.
అయితే కోహ్లీ ఈ రకమైన ప్రవర్తనతోనే ఇతర దేశాలలో కూడా సిరీస్ లు గెలిచిన విషయాన్ని మరిచిపోవద్దని కోహ్లీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కోహ్లీ తనలాగే ఉంటాడని…. అదే టీమ్ కి కూడా మంచిదని వారు వారి ఫేవరెట్ ఆటగాడికి మద్దతు పలికారు. అయితే ధోని లాగా ‘కూల్ కెప్టెన్’ అనిపించుకోకపోయినా కనీసం తన అసహనాన్ని జట్టులోని ఇతర ఆటగాళ్లు ముందు…. అది కూడా మైదానంలో వ్యక్తపరిస్తే బాగోదు అని వీరి వాదన.
నిన్న చూసినట్లయితే ఫీలింగ్ సరిగ్గా చేయనందుకు కోహ్లీ శార్దూల్ ఠాకూర్ ని తిట్టడం చూడవచ్చు. అయితే విరాట్ చాలా మంచి స్వభావం ఉన్న వ్యక్తి అని భారత ఆటగాళ్లు అందరూ ఎప్పుడూ కొనియాడుతారు. మైదానంలో ఆ నిమిషానికి అలా ప్రవర్తించినా బయట అతనిపై ఎలాంటి విమర్శలు లేకపోవడం గమనార్హం.