లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో చైనాతో యుద్ధమేఘాలు అలుముకునే అవకాశం ఉండటంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయింది.
మరోపక్క గత మూడు నెలల నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఉగ్రవాదుల ఎన్ కౌంటర్లలో చాలా మంది ఉగ్రవాదుల్ని భారత్ ఆర్మీ మట్టు పెడుతూ ఎత్తి వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భారత సైనికులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వస్తున్నారు. ఇలా ఉండగా గురువారం జమ్మూ కాశ్మీర్ లోయ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు.
లోయలో అలజడి సృష్టిస్తూ భారత సైనికులను కవ్వించే చర్యలకు తెగబడ్డారు. దీంతో వారిని పట్టుకోవడానికి సైనికులు పక్కా స్కెచ్ వేసి పక్కా సమాచారంతో అవంతిపోరా జిల్లాలో ఎన్ కౌంటర్ స్టార్ట్ చేశారు. పామ్పోరె ప్రాంతంలోని మీజ్ గ్రామంలో జరుగుతున్న ఈ ఎన్ కౌంటర్లలో కొంతమంది ఉగ్రవాదులు మసీదులో కి వెళ్లి తలదాచుకున్నారు.
మరోపక్క కొంతమంది సమీప గ్రామాలలో లోయలలో భారత్ ఆర్మీ నుండి తప్పించుకున్నారు. దీంతో లోయలో మరియు పామ్పోరె ప్రాంతంలోని మీజ్ గ్రామం చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.