India Post : డబ్బు సంపాదించడం ఎంత అవసరమో.. దాన్ని సరైన మార్గంలో పొదుపు చేయడం కూడా అంతే అవసరం..సరైన మార్గంలో మీ పొదుపును పెట్టుబడిగా పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.. చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బులు పొదుపు చేయాలని కోరుకుంటారు.. అయితే రిస్కు లేకుండా తాము పెట్టిన డబ్బులకు ఇంట్రెస్ట్ రావాలని అనుకుంటారు.. అలాంటి వారి కోసమే పోస్ట్ ఆఫీస్ రకరకాల పొదుపు పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.. ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడం, వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉండడంతో వినియోగదారులు కూడా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి మంచి వడ్డీని అందిస్తోంది.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* సుకన్య సమృద్ధి పథకం ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని పొందవచ్చు.
*కిసాన్ వికాస్ పత్రం స్క్రీన్ ద్వారా సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని అందిస్తున్నారు.
*సీనియర్ సిటిజన్స్ కోసం ఇండియన్ పోస్టల్ సరికొత్త పథకాన్ని తీసుకు వచ్చింది దీని ద్వారా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది.
*పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి అధికంగా 7.3 శాతం వడ్డీని అందిస్తోంది.
*మంత్లీ ఇన్కమ్ అకౌంట్ ఉన్నవారికి 6.6 శాతం వడ్డీ లభిస్తుంది.
*5 సంవత్సరాలపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.7 శాతం వడ్డీని అందిస్తారు. ప్రతి త్రైమాసికానికి ఇంట్రెస్ట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.
* 1-3 సంవత్సరాల పాటు డిపాజిట్ చేసిన మొత్తానికి 5.5 శాతం వడ్డీని అందిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి ఇంట్రెస్ట్ ను విత్డ్రా చేసుకోవచ్చు.
* పోస్టాఫీసు లో ప్రతి సాధారణ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తానికి సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీ అందిస్తుంది.
మీ ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా మీకు నచ్చిన స్కీమ్ లో పొదుపు చేసుకోండి.