ఐపీఎల్ 2020ను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ పచ్చ జెండా ఊపిన విషయం తెల్సిందే.సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకూ ఈ సీజన్ ఐపీఎల్ ను నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐపీఎల్ లో పాల్గొననున్న 8 జట్లు టీమ్ కు 24 మంది ప్లేయర్లతో ఆడొచ్చని నిబంధనను విధించింది. యూఏఈలో మూడు స్టేడియాలు దుబాయ్, షార్జా, అబూ దాబిలలో ఐపీఎల్ నిర్వహించనున్నారు.
మ్యాచ్ లు సాయంతం 7 గంటల 30 నిమిషాల నుండి మొదలవుతాయి. అలాగే సీజన్ ఫస్ట్ హాఫ్ లో వీక్షకులను అనుమతించరు, సెకండ్ హాఫ్ లో మాత్రం 40 శాతం వీక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ స్పాన్సర్లు ఈ ఏడాది కూడా అలాగే కొనసాగనున్నాయి.